పవన్ కళ్యాణ్ మాటే మాకు వేదం

  • మా అధ్యక్షులు నియమించిన జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ అరణి శ్రీనివాసులు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటాం అని ముక్తకంఠంతో తెలిపిన తిరుపతి నాయకులు

తిరుపతి: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అధ్యక్షతన కన్ఫ్లిక్ట్ మానేజ్మెంట్ హెడ్ అజయ్ కుమార్, కోశాధికారి రత్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారితో మరియు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు వేదం అయన ఆదేశాల మేరకు అయన నియమించిన తిరుపతి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు గారిని రాయలసీమలో అత్యంత మెజారిటీతో గెలిపించి కళ్యాణ్ గారికి కనుకగా ఇస్తాం అని తిరుపతి నాయకులు అంత ముక్తకంఠంతో పలికారు. టీడీపీ బీజేపీ పార్టీలు ఏకథటిపై వచ్చి అందరూ కలసి ఈ దుష్ట పాలనను అరికట్టి ప్రజల ప్రభుత్వం తీసుకునిరావటమే మన ధ్యేయం అని తెలియచేసారు.