చింతర్లపల్లి గ్రామంలో ఇంటింటా జనసేన-టిడిపి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కు మద్దతుగా శెట్టూరు మండలంలోని “చింతర్లపల్లి” గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో అమిలినేని సురేంద్రబాబు సతీమణి అమిలినేని రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులతో జనసేన-టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య జనసేన పార్టీ తరఫున హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున శెట్టూరు మండల అధ్యక్షులు కాంత్ రాజు, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, జనసేన వీరమహిళల ఇంచార్జులు షేక్ తార, మమత, కల్పన, ముఖ్య నాయకులు రాజు, అనిల్ పాల్యం, శెట్టూరు మండలం నుండి కార్యదర్శులు చెన్నమల్లి, ప్రధాన కార్యదర్శులు గురుస్వామి, జనసేన కార్యకర్తలు పవన్ కుమార్, ప్రదీప్, తిప్పేస్వామి, రమేష్, రవి, శశికుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.