మత్స్యకార దినోత్సవ సభ వాయిదా..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపూర్ పర్యటన వాయిదా పడింది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయిందని, నరసాపురం సభ వాయిదా వేస్తున్నట్టు జనసేన పార్టీ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు నిర్వహించ తలపెట్టిన మత్స్యకార దినోత్సవ సభ వాయిదాపడింది. ఈ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయి, ప్రాణ నష్టం, పంట నష్టం సంభవించిన తరుణంలో బహిరంగ సభ నిర్వహణ భావ్యం కాదని, కోస్తా జిల్లాల్లోనూ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.