పవనన్న చేనేత బాట – 50 రోజు
జనసేన పార్టీ చీరాల నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న పవనన్న చేనేత బాట 50 రోజు కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుల వారు మాట్లాడుతూ 50 రోజులుగా కార్యక్రమాన్ని అంకిత భావంతో కొనసాగిస్తున్నటువంటి కర్ణకిరణ్ తేజ కు మరియు అతని మిత్ర బృండం పసుపులేటి సాయి, పింజల సంతోష్, వరం బూడిద, పృథ్వీ శ్రీహరి, పల్లపొలు సాయి లకు ప్రత్యేక అభినందనలు తెలియపరిచినారు. ప్రభావంతో ఇదే స్ఫూర్తితో చీరాల నియోజకవర్గం మొత్తం చేనేతల సమస్యలు తెలుసుకోమని చెప్పడం జరిగినది.
అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేనేతరంగానికి ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఎప్పుడు చేనేతల్ని స్మరించుకుంటు కళాకారులుగా గౌరవిస్తూ మాట్లాడుతుంటారు. వాళ్ళ మీద ఆయనకు ప్రత్యేక దృష్టి ఉన్నది. రైతన్న తర్వాత నేతన్న అని చెప్పి కార్మికులకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది.
ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఊపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, రాయని రమేష్ , ముత్యాల కళ్యాణ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాలవలస శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.