పార్వతీపురంలో ఘనంగా రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు

పార్వతీపురం: కోణీదెల చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా పార్వతీపురంలో మెగా రక్తదాన శిబిరం వసంత కుమార్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మెగా ఫ్యామిలీ సేవా సంఘం సభ్యులు ప్రెసిడెంట్ రాజన రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోర్లి చంటి ఆధ్వర్యంలో సుమారు 20 యునిట్లు రక్తం దాతలను బుధవారం స్వచ్ఛందంగా వచ్చి రక్తం దానం చేయడం జరిగింది. రాంచరణ్ యువశక్తి ప్రెసిడెంట్ చందు, జనసేన బ్లడ్ డోనార్ గ్రూప్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ నాని, ప్రవిణ్, శీవ, బాలు, సంతోష్, వంశి, దుర్గా, సాయి, చిన్న, ప్రవిణ్, వాసు తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నమస్కరించి సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలుపు కున్నారు.