Nellore: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ బరిలో జనసేన

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి జనసేనపార్టీ అభ్యర్ధులను బరిలోకి దించింది. ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ దగ్గరుండి అభ్యర్ధులతో నామపత్రాలు దాఖలు చేయించారు. రిటర్నింగ్ అధికారి వద్దకు పోటీకి సిద్ధమైన అభ్యర్ధులంతా కలసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, అదే సమయంలో అధికార పార్టీ విధానాల పట్ల రోజు రోజుకీ పెరిగిపోతున్న వ్యతిరేకత తమను గెలిపిస్తాయన్న ఆశాభావాన్ని అభ్యర్ధులు వ్యక్తం చేశారు.