ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 27వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, గురవయ్య సాల గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 27వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని గురవయ్య సాల గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ కార్యక్రమంలో కొనసాగగా, జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంకి అవకాశం ఇస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, ఆ రెండు పార్టీల పరిపాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని, అభివృద్ధికి నోచుకోలేదని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు లాభసాటి ధర కల్పిస్తుందని,యువతకి ఉపాధి అవకాశాలు, గ్రామ అభివృద్ధి జరుగుతుందని రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసుకు ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి అంటూ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్ కసుమూరు కడివేటి పవన్, పేడురు హరి, ధనుంజయ్, నీళ్ల విష్ణు, కత్తి భాను ప్రకాష్, వలిపి వెంకట రమణ, తాండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు.