పెడన నియోజవర్గ రైతు సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం

పెడన: గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు పర్యటించడం జరిగింది జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ది.19-12-2022 ఉదయం 12 గంటలకు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ కి పెడన నియోజవర్గ రైతులు తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది.

*గోను సంచుల కొరత

*ధాన్యం రవాణా వాహనాల కొరత

*తేమ శాతం సమస్య (ఆర్ బి కే తేమ శాతానికి, మిల్లర్ల తేమ శాతానికి తేడా రావడం)

మాండూస్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. పై సమస్యలపై జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.