రాక్షస పాలనకు సూచన: చొప్పా చంద్రశేఖర్

అనంతపురం జిల్లా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై కుట్ర అంటే అది నీతివంతమైన వ్యవస్థపై కుట్రగా భావించాలి. ఇందు మూలంగా రాష్ట్ర ప్రజలకు తెలిపేది ఏమిటంటే ఒక్క అవకాశం అని ఒక్కసారే కదా అని మన నిర్ణయం పొరపాటు, పోనిస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉందనేది గత మూడున్నర సంవత్సరాల నుండి చూస్తున్నారు. నిర్మాణాల కూల్చివేత వ్యవస్థలను భ్రష్టు పట్టించటం ప్రాంతాల మద్య, కులాల మద్య తగాదాలు పెట్టడం. ఈ విధమైన రాక్షస పాలన జరుగుతుంది. ఇటువంటి రాక్షస పాలన అంతమొందించటానికి వచ్చిన నీతి నిజాయితీలకు నిలువుటద్దం అయిన పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు అనే ఆక్రోశం. బాధతో అతనిని అంతమొందించటానికి కుట్రలు చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ పై కుట్ర కాదు నీతివంతమైన వ్యవస్థ పై కుట్ర అని బావించాలి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన జనసేన పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాల నుంచి సామాన్య ప్రజల నుంచి నాయకులను తయారు చేస్తున్నారు. వారు నాయకులు అయితే ఇప్పుడు ఉన్న ఈ అవినీతి నాయకులకు కాలం చెల్లుతుంది అని బావించి. కుట్రలుపన్నుతున్నారు. ఎందుకంటే వారంతా ప్రజాధనాన్ని దోచుకొని ఎన్నికల్లో ఓటుకు నోటు, వెయ్యి, రెండు వేల రూపాయలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వారే ఇటువంటి నాయకులు ప్రజావ్యవస్థలను కూలదోస్తుంటే కాపాడటానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు అని వారిని నాశనం చేస్తే వారి రాక్షస పాలన కొనసాగించవచ్చు అనే భావనలో ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జడ్ కేటగిరీ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. లేనియడల పవన్ కళ్యాణ్ కి ఏవిధమైన హాని జరిగినా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరిస్తున్నాం, మా నాయకులు పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నాం ఖబర్దార్ అని అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్ అన్నారు.