పెనుగొండ నియోజకవర్గం పరిగి మండల జనసేన ఆధ్వర్యంలో వినతిపత్రం

పరిగి ఎంపిడిఓ బదిలీ అయిన ఉద్యోగిని కౌసర్ బేగంని విధుల్లోకి చేర్చుకోకుండా పెనుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు శంకర్ నారాయణ తమ్ముడు రవింద్ర చెప్తేనే విధుల్లోకి చేర్చుకుంటాం అంటూ వైసీపీ కార్యకర్తలా వ్యవహరించిన ఎంపిడిఓ గారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలని జనసేన పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి శివ, మండల అధ్యక్షులు సురేష్, డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నాగేష్, రవితేజ, రామాంజినప్ప, నారాయణ స్వామి, రామాంజి పాల్గొన్నారు.