మదనపల్లె లో అఖిలపక్ష పార్టీ నేతల అరెస్ట్ మరియు హౌస్ అరెస్ట్ లు
మదనపల్లి జిల్లా సాధన కోసం జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి మరియు మదనపల్లె సాధన జే.ఏ.సీ ఆధ్వర్యం లో జరుగుతున్న మదనపల్లె సకల జనుల బంద్ ను వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అణచి వేయాలని జే.ఏ.సీ నాయకులను మరియు అన్ని పార్టీ ల కార్యకర్తలను అరెస్టు చేసి ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అదేవిధంగా జనసేన ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం కు ముందు జాగ్రత్తగా నోటీస్ ఇవ్వడం.. కొంత మందిని హౌస్ అరెస్ట్ చేయడం.. స్వఛ్చందంగా బంద్ పాటిస్తున్న వర్తకులకి మరియు స్కూల్స్ ని.. అందరిని ప్రభుత్వ అధికారులు వచ్చి భలవంతంగా షాపులు తెరవాల్సిందిగా ఆదేశాలిస్తున్నారు.