జనసైనికుడిని కోల్పోవడం బాధాకరం

గురజాల మండలం, పల్లెగుంత గ్రామానికి చెందిన దీకొండ వేణు అనే జన సైనికుడు ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. వేణు పెద్దకర్మ కార్యక్రమానికి జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు విచ్చేసి వేణు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిస్వార్థ జనసైనికుడిని కోల్పోవటం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు వ్యాప్తంగా ఉన్న జనసైనికులందరూ.. క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాదవశాత్తు ప్రమాదాలకు గురైయితే పార్టీ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కటికం అంకారావు, సంయుక్త కార్యదర్శి దుదేకుల ఖాసీంసైదా, జనసేన నాయకులు భావన్నారాయణ, తోట నర్సయ్య, సలీం, పసుమర్తి మణి, శిరిగిరి మణికంఠ, నాలుగు మండలాల అధ్యక్షులు, జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.