ఇంటర్ పాసైన వారికి ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ఆర్మీ.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్లో ఆఫీసర్లుగా నియమిస్తారు.10+2 పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.
కోర్సు: 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్- 44
ఖాళీలు: 90
కోర్సు ప్రారంభం: జనవరి 2021
అర్హత: కనీసం 70శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 16 1/2 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబర్ 09, 2020.
వెబ్సైట్:http://www.joinindianarmy.nic.in/