ఎన్నికల ప్రచారానికి అనుమతి తప్పనిసరి

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోభాగంగా పాదయాత్రలు, ర్యాలీలు, సమావేశాలు  చేసుకునేందుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ శుక్రవారం తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ.. 48 గంటల ముందు డీసీపీ, ఏసీపీ నుంచి రాతపూర్వకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. లౌడ్‌ స్పీకర్లు, మొబైల్‌ ప్రచారానికి కూడా అనుమతులు తప్పరిసరని చెప్పారు.