దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండల ఎంపీడీవోకి వినతి పత్రం

జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలంలోని మక్తాపురం అనసూయ నగర్ గ్రామపంచాయతీలో ప్రజలు పడుతున్న సమస్యల పట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సంగం మండలంలోని ఎంపీడీవోకి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ప్రతి సంవత్సరం వర్షాల కారణంగా సోమశిల డ్యామ్ కు అధిక మోతాదులో వర్షపునీరు చేరడం జరుగుతుంది. సోమశిల డ్యాం నుంచి దిగువకు పెన్నా నదికి వర్షపు నీరు వదులుతారు. పెన్నా నదికి వర్షపు నీరు వదలనప్పుడు సంగం మండలంలోని పెన్నా నదికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు అయినా కోలగట్ల, అనుసూయనగర్, మక్తాపురం గ్రామాల నందు పెన్నా నది పొల్లుకట్లు సరిగ్గా లేకుండా ఉండటం వల్ల వర్షపు నీరు గ్రామాలకు వచ్చి గ్రామాలు నీట మునగడం జరుగుతున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ పెన్నా నది పొల్లు కట్టను మరమ్మతులు చేసిన పాపానే పోలేదు. సంగం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో రోడ్లు, డ్రైనేజ్ కాలువ లేకుండా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ కార్యక్రమంలో మావిళ్ళ ఆనందరావు, కృష్ణమోహన్, గురవరాజు, రామ్తుల్లా, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.