నిర్మల్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం

భైంసా, లోకేశ్వరం మండల కనకాపుర్ గ్రామ దళిత రైతు గత కొన్ని సంవత్సరాలుగా 5 ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. ప్రభుత్వం పట్టా కూడా ఇచ్చింది. కాని అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ విడిసి దౌర్జన్యంగా ఆ భూమిని లాక్కొని కొబ్బొన్నోల్ల గంగన్నను రౌడీలతో కొట్టించి,అదే స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి, పంటలో ఉన్న బోర్లను తొలగించి, క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి అక్రమంగా ఆ భూమి నుండి వెళ్లగొట్టారు. దీన్ని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు తీవ్రంగా ఖండిస్తున్నాం. దళితుల పట్ల ఇంత వివక్ష చూపిస్తున్న అగ్రవర్ణాల ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అండతో దీనికి పాల్పడుతున్నాడు. దాడి చేసిన వారిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు, భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేయకపోవడం వల్ల కలెక్టర్ ఆఫీస్ ముందర గత 15 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. ధరఖాస్తు ఇచ్చిన వెంటనే కలెక్టర్ స్పందించి రెవెన్యూ అధికారులకు చెప్పారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుంది. దీనికి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రజలు రైతులు అందరు సహకరించాలని కోరుతున్నామని తెలిపారు.