మధిర జనసేన ఆధ్వర్యంలో కొణిదెల అంజనాదేవి పుట్టినరోజు వేడుకలు

కొణిదెల అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా బోనకల్ వృధాశ్రమంలో జనసేన ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనసేన మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరు డేవిడ్ మాట్లాడుతూ.. మా తల్లి అంజనదేవి గారు వారు నిండు నూరేళ్లు ఆయుషు ఆరోగ్యాలతోఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూన్నాం, అంజనదేవి గారు జన్మనిచ్చిన చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్కళ్యాణ్ గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని ప్రజలందరూ గర్వించే విధంగా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ.. కరోనా సమయంలో దేశం విలవిలలాడుతున్న సమయంలో నేను ఉన్నా మీకు అని చెప్పి మానవసేవే మాధవ సేవ అనే దృక్పధంతో, తెలుగు రాష్ట్రాల్లో వారి సొంత డబ్బుతో ఆక్సీజన్ ప్లాంట్ లు పెట్టి, ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అదే విధంగా నాగబాబు గారు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని ఆదుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ని స్థాపించి దేశం గర్వించే విధంగా సమస్యలపై పోరాడుతూ, ప్రజలకు అండగా వుంటూ మాకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు, వారి కుటుంబానికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాల,ని అదేవిధంగా తల్లి అంజనదేవి దేవి గారికి మధిర నియోజకవర్గ జనసేన పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ కార్యక్రమంలో సంగపు నరేంద్ర, అద్దంకి సంతోష్, కుమార్, షైక్ జానీపాషా తదితరులు పాల్గొన్నారు.