ఈదర హరిబాబుకి శుభాకాంక్షలు తెలిపిన కొండేపి జనసేన నాయకులు

కొండేపి, జనసేన పార్టీ లో క్రియాశీల సభ్యత్వ కమిటీ చైర్మన్ గా ఎన్నిక కాబడిన ఈదర హరిబాబుని కొండేపి జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలపటం జరిగింది. ఈ కొండేపి నియోజకవర్గం ఆరు మండల అధ్యక్షులు పాల్గొనటం జరిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ కొండేపి నియోజకవర్గంలో పార్టీ బలపడే విధివిధానాలను వివరించటం జరిగింది. రాబోయే సంకీర్ణ ప్రభుత్వం కోసం జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ లో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చెయ్యాలని తెలిపారు. ఈదర హరిబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో క్రియాశీల సభ్యత్వ వాలంటీర్స్ అందరూ ఒక బలమైన శక్తిగా ఎదగాలని తద్వారా పార్టీని బలపరచాలని దిశా నిర్దేశం చెయ్యటం జరింగింది. ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం అధ్యక్షులు(ఐటీ వింగ్) పిల్లిపోగు పీటర్ బాబు, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్ మరియు టంగుటూరు మండలం అధ్యక్షులు కందుకూరి రాంబాబు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.