ప్రతి ఇంటికి జనసేన 7వ రోజు

అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లె జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన గురువారం సిటియం పంచాయతీ పూలోల్ల పల్లెలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూలోల్ల పల్లె నుండి 30 మంది యువకులు, మహిళలు జనసేన పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పూలోల్ల పల్లె నాయకులు వెంకటేష్, చిన్న రెడ్డి, గంగాధర్, శ్రీధర్, పవన్, రాజు, సాగర్, మురళి, అంజి పల్లె ప్రజలు మదనపల్లి జనసేన నాయకులు ఆకుల శంకర, ధరణి, చంద్ర శేఖర్, తొక్కోల శివ, వీర మహిళలు పాల్గొన్నారు.