కిమ్స్ లో పలువురిని పరామర్శించిన పితాని బాలకృష్ణ
ముమ్మిడివరం నియోజకవర్గం: అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం, కాట్రేనికోన గ్రామానికి చెందిన గుత్తాల సతీష్, గెడ్డం అశోక్, గుత్తాల శ్రీరామ్, మేడిద జ్యోతి, వరలక్ష్మి లు ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న జనసేన పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సోమవారం భాదితులను అమలాపురం కిమ్స్ హాస్పిటల్ నందు పరామర్శించి, అనంతరం అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గున్నేపల్లి గ్రామానికి చెందిన గొలకోటి చంద్రరావును పరామర్శించారు. వీరితోపాటు గొలకోటి వెంకటేశ్వరరావు, దూడల స్వామి, పితాని రాజు, గెడ్డం వెంకటేష్, నందకిషోర్, సుధీర్, లక్ష్మణ్, చిక్కాల శ్రీను, భీమా, చిన్నారావు పాల్గొన్నారు.