ఇంటింటికి పవనన్న ప్రజాబాటతో దూసుకెళ్తున్న బొర్రా

ముప్పాళ్ళ మండలం, చాగంటి వారి పాలెం గ్రామంలో ఇంటింటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. చాగంటివారిపాలెం గ్రామ ప్రజలు ఎంతో ఘనంగా ప్రేమగా బొర్రా వెంకట అప్పారావుకి మరియు ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ మేము ఈ గ్రామంలో కార్యక్రమం చేస్తున్నామని తెలిసి కొందరు నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చేశారు. మీరు అడ్డుపెడితే ఆగిపోవడానికి మేము మీలాగా పేటీఎం బ్యాచ్ కాదని, పవన్ అన్న కోసం ప్రాణాలకు తెగించి పోరాడే వ్యక్తులు మని మీరు తెలుసుకోవాలని రాజకీయాల్లో హుందాతనం ఉండాలి తప్ప ఇలాంటి విలువలను రాజకీయాలు చేయటం అధికారం ఉందని అధికారులు ఉన్నారని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయటంమీ స్థాయికి తగదని అధికారం ఎవరికి శాశ్వతం కాదని తెలియజేశారు. ఈ గ్రామ రాజకీయాలు ఈ గ్రామంలో ప్రజలు అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యలను గాలికి వదిలేసి ఇలా మాపైన ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్న మమ్మల్ని ఆపటం వెనుక మీ చేతగానితనాన్ని మీ డొల్ల తనాన్ని ఎక్కడ మేము ఎత్తి చూపుతామని. భయంతోనే ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని త్వరలోనే మీ అందరికీ కూడా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.