పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం, బలుసుతిప్ప గ్రామంలో పర్యటించి పలుకుటుంబాలను పరమర్శించారు. పర్యటనలో భాగంగా బలిసితిప్ప గ్రామస్తుడు, జనసేన పార్టీ నాయకుడు ఓలేటి అప్పారావు కుమారుడు ఓలేటి జీవన్ 13 సంవత్సరాలు క్యాన్సర్ వ్యాధితో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అదే గ్రామంలో హార్ట్ ఎటాక్ తో మరణించిన మేడ వీరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరికి ఆర్థిక సాయం మరియు 50 కేజీల రైస్ బాగ్ అందజేశారు. వీరి వెంట ఏ.సి.ఎఫ్ సంసాని పాండురంగ, సంఘాని ధర్మారావు, ఓలేటి శీను, పెమ్మాడి శీను, సంఘాని శీను, పిల్లి గోపి, గిడ్డిరత్నశ్రీ, బీమాల సూరి నాయుడు, పితాని రాజు, కడల వెంకటేశ్వరరావు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.