Pithapuram: విజయవంతంగా జనసేన శ్రేణుల శ్రమదానం

జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు శ్రమదానంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం ఎండపల్లి నుండి వయా అమినాబాద్ ఉప్పాడ వెళ్లే మార్గమున పార్టీ తరుపున నియోజకవర్గ నాయకులు మత్సా అప్పాజీ మాజీ సర్పంచ్ మరియు మాజీ మధ్యప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ సభ్యులు ఆధ్వర్యంలో వెళ్ళు రహదారికి మరమ్మతు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు పెనుపోతుల రామూర్తి, గుండ్ర దుర్గాప్రసాద్, పి. అవినాష్, జి. రామస్వామి, మత్సా నాని, మత్సా రుద్రయ్య, మారిశెట్టి నాగశక్తి, ఈడురి శ్రీను, సాయి, మొయిళ్ళ శివ, అనిల్, దుర్గ, సాయి కొత్తపల్లి, నామ దుర్గాప్రసాద్, గంగాధర్, బషీర్, శంకర్ రావు, రాము, రాంబాబు, ప్రసాద్, మత్సా శేషగిరి, పంచాది రమేష్, కాశీ విశ్వనాధం, బాల, మత్సా వీర్రాజు మొదలగు జనసైనికులు పాల్గొని శ్రమదానం చేసి విజయవంతం చేశారు.