వికలాంగునికి అండగా పోలవరం జనసేన

పోలవరం, జనంలో జనసేన కార్యక్రమంలో పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు మరియు మండల గ్రామ సభ్యులు గ్రామ పర్యటనలో భాగంగా పోలవరం నియోజకవర్గం పోలవరం మండలం యల్‌ యం డి పేట గ్రామంలో పెన్షన్ కి పూర్తి అర్హత ఉన్న వికలాంగుడైన సాదుబోయిన వెంకటేష్‌కి ఇప్పటికీ పెన్షన్ అందడంలేదు. సంబందిత అధికారులను నిలదీయగా రెండు మూడు నెలల్లో అవుతుంది అని దాటవేత మాటలు చెప్పడంతో ప్రభుత్వం నుండి తనకు ఫెంక్షన్‌ అందేవరకూ జనసేన పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు మండల అద్యక్షులు గుణపర్తి వీరవెంకట సత్యనారాయణ (చిన్ని) మరియు గ్రామ జనసైనికులు ఆ డబ్బుని జనసేనపార్టీ తరుపున అందించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చే వరకూ ఈ సాయం కొనసాగుతుందని తెలిపారు.