పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి జాతరలో పాల్గొన్న గాదె

గుంటూరు, గురువారం జరిగిన కొర్రపొడు పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి, ఉగాది సందర్భంగా తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ లైటింగ్ విద్యుత్ ప్రభను మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిధిగా గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు, బయట నుంచి వచ్చిన మన బంధువులకు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇలాంటి భారీ లైటింగ్ ప్రభను మన పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వరుసగా 2 వ సంవత్సరం నిర్వహించడం చాలా సంతోషకరమని అధికార ప్రభుత్వం వారు పోలీసులను ముందు పెట్టి చాలా అరాచకాలు చేస్తున్నారు. మేము అన్ని పర్మిషన్లు అధికారికంగా తీసికున్నా మా వాళ్ళని పోలీస్ వారు వచ్చి ఇబ్బన్దులకు గురిచేస్తున్నారు. ఊరులో ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకునే పండగను ఇలా ఇబ్బన్దులకు గురి చేయటం చాలా దుర్మార్గం, నేను ఒక్కటే చెప్తున్నా మీరు అందరూ రేపు వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి వేసి ఓటు వేసి ఈ చేతకాని ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, కేశవ, శిఖా బాలు, సిరిగిరి శ్రీను, చట్రాల త్రినాద్, రాడ్ల శ్రీను, నెల్లూరు రాజేష్, గోపిశెట్టి సాయి, కందుల సైదయ్య, మాసాబత్తుని శ్రీనివాసరావు, పోతంశెట్టి శ్రీనివాసరావు, చింతా పెద్ద భద్రయ్య, దగ్గుపాటి శ్రీనివాసరావు, గోపి దేశి సాంబశివరావు, శిరిగిరి సోమయ్య, మొకరల హరి బాలకృష్ణ, యద్దనపూడి రమేష్, కొర్రపాడు గ్రామ జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.