శ్రీశ్రీశ్రీ పట్టాభి రామచంద్రస్వామి వారి నూతన ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న తణుకు జనసేన

తణుకు నియోజకవర్గం, తణుకు మండలం కొమరవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పట్టాభి రామచంద్రస్వామి వారి నూతన ఆలయ విగ్రహ, శిఖర పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు తణుకు మండల అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జవ్వాది ప్రసాదు మరియు కొమరోవరం జనసేన పార్టీ నాయకులు మాదిరెడ్డి సురేష్, పండు, ఎం సుబ్బారావు(ఎంపిటిసి) తెలగారెడ్డి లక్ష్మి, డి శీను కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.