పలు కుటుంబాలను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం రూరల్, వెల్ల గ్రామం వాస్తవ్యులు గెడ్డం గంగా చలం ఇటీవల స్వర్గస్దులైనారు వారి సోదరుడు గెడ్డం బాబురావుని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కలసి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా.. రామచంద్రపురం రూరల్, వెల్ల గ్రామం వాస్తవ్యులు పెద్దిరెడ్డి దొరయ్య కాపు ఇటీవల స్వర్గస్దులైనారు.. వారి కుమారుడు నాగబాబుని కలసి
పోలిశెట్టి చంద్రశేఖర్ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి చంద్రశేఖర్
తో పాటూ తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుంగరాజు, వెల్ల 1 గ్రామం జనసేన పార్టీ ఎం.పి.టీ.సీ చిక్కాల స్వామి, రాంబాబు నాయుడు, వెల్ల గ్రామం జనసేన నాయకులు జనసైనికులు కూడా పాల్గొన్నారు.