ఆంజనేయస్వామి వారికి వెండి కిరీటం అలంకరణ కార్యక్రమం
అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని
రాజంపేట, రాయచోటి వెళ్ళే రహదారిపై వీరబల్లి, సుండుపల్లి మండలాల సరిహద్దులో వెలసిన శ్రీశ్రీశ్రీఆంజనేయస్వామిదేవస్తానము లో స్వామి వారికి నూతన వెండి కిరీటం అలంకరణ, అభిషేక కార్యక్రమంను రామావాండ్లపల్లి వాసి చిన్నగొల్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ రామజయచంద్ర చేపట్డం జరిగింది. కార్యక్రమ ఆహ్వానం మేరకు వివిధ సామాజిక వర్గ నేతలు, స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు మిత్రులతో కలిసి స్వామి వారి పూజలో పాల్గొని.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను. కార్యక్రమంలో బాగంగా సర్పంచ్ రామా జయచంద్ర ఇచ్చిన విందులో ఆహ్వానితులందరూ పాల్గొనడం జరిగింది.