లక్కు వీరన్నకు ఇంటిని నిర్మించి ఇచ్చిన కొవ్వలి ఫౌండేషన్

నరసాపురం, మొగల్తూరు మండలం లక్కు వారి తోటకు చెందిన లక్కు వీరన్న ఇల్లు అగ్ని ప్రమాదానికి గురవడంతో కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు స్పందించారు. కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త ఇంటిని 10 రోజుల్లో నిర్మించి బుధవారం తెదేపా నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి పొత్తూరి రామాంజనేయరాజు (రామరాజు), కొవ్వలి ఫౌండేషన్ వైస్ చైర్మన్ నిమ్మకాయల నీలిమల చేతుల మీదుగా రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. మానవ సేవే పరమావధిగా భావించి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న కొవ్వలి రామ్మోహన్ నాయుడు ఆదర్శనీయుడని రామరాజు అన్నారు. భవిష్యత్తులో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరింత సేవలు చేయాలని ఆకాంక్షించారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పేదలను, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో కొవ్వలి ఫౌండేషన్ ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటి వరకు విద్యా, వైద్య, ఉద్యోగ, ఆధ్యాత్మికంగా తమ శక్తికి మించి సేవలు అందించామని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉంటూ మరికొంత మందికి సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వలి ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు నిమ్మకాయల నీలిమ, తెదేపా మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు, మాజీ ఎంపిపి కత్తిమండ ముత్యాలరావు, మామిడిశెట్టి సత్యనారాయణ, ఆకన కోటి, బొక్కా సత్యనారాయణ, లక్కు శ్రీను, లక్కు పాండు రంగారావు, లక్కు శేషు, ఆకన సుబ్రహ్మణ్యం, కొల్లాటి బాలకృష్ణ, పాలా రాంబాబు, పులపర్తి త్రిమూర్తులు, చాగంటి శ్రీను తదితరులు ఉన్నారు.