దేవిక కుటుంబాన్ని పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం నియోజకవర్గం, కె గంగవరం మండలం, గంగవరం గ్రామానికి చెందిన కాదా దేవిక ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హత్య కావడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులను రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పరామర్శించడం జరిగింది. ఇలాంటి నేరాలు చేస్తున్న నేరస్తులకు ప్రభుత్వం కఠిన శిక్షలు అమలు చేయవలసిందిగా, దిశా చట్టాలు ఏర్పడినా సరే ఇటువంటి నేరస్థులకు శిక్షలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని పోలిశెట్టి చంద్రశేఖర్ కోరడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర వీర మహిళలు, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తదితర జనసైనికులు సోమవారం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది.