నాగబాబును మర్యాదపూర్వకంగా కలసిన షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును ఆదివారం డిఆర్ ఉత్తమ్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మండలంలో ఉన్న పలు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన వచ్చినప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగరం మండలం సోమశిల ప్రాజెక్టు దెబ్బ తినే ఆఫ్రాన్ ప్రాంతంను, మండలంలో ఉన్న రోడ్ల దుస్థితి గురించి మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన వచ్చినప్పుడు సోమశిల ప్రాజెక్టు సందర్శిస్తారు అని చెప్పడం జరిగింది.