బీహార్‌లో తొలివిడత పోలింగ్

మూడు విడతలుగా జరగనున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. బీహార్ లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉండగా.. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

మొదటి విడతలో 71 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో మొత్తం 1,066 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇవాళ 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లను చేశారు.