తండ్రి మరణం తర్వాత ప్రదీప్ మొదటిసారి సోషల్ మీడియా లో పోస్ట్

కరోనా మహమ్మారికి ఎంతోమంది బలివ్వగా.. వారిలో యాంకర్ ప్రదీప్ తండ్రి ఒకరు. తండ్రి మరణం తర్వాత మొదటిసారి ప్రదీప్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ”ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నా అంటే దానికి మీరే కారణం మీరే, అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా హుందాగా చిరునవ్వు తగ్గకుండా ఎలా ఎదుర్కోవాలో చూపినందుకు మీకు థాంక్యూ, నేనేం చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను మీ జీవితానికి ఒక అర్థం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను” అని ప్రదీప్ పేర్కొన్నారు.

”నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెంట నిలబడ్డారు, మీరు ఎంతో ప్రేమతో ముక్కలైన నా మనస్సును ఎన్నో సార్లు బాగు చేశారు, మీ ధైర్యం నాకు ఎన్నో సార్లు స్ఫూర్తినిచ్చింది. అలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసింది. దానిని మించిన ప్రేమ ఏమీ లేదు, మీరు నాకు ఎప్పటికీ స్పెషల్, జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండనివ్వండి, మిమ్మల్ని ప్రేమించడం మాత్రం నేను ఆపలేను, మీరు కోరుకున్నట్లుగానే నా జీవితంలో నేను జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్లకు నవ్వు తెప్పిస్తూనే ఉంటాను, మనం కలిసేదాకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాను నాన్న” అంటూ ఎమోషనల్ గా ప్రదీప్ ఒక పోస్ట్ చేశాడు.