39వ డివిజనులో ప్రజా చైతన్య యాత్ర

కాకినాడ సిటి, జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో డివిజన్ నాయకురాలు బండి సుజాత ఆధ్వర్యంలో 39వ డివిజనులో చీడీలపోర ప్రాంతంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా చైతన్య యాత్రలో జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలను కలుస్తూ నేడు ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ఈ వై.సి.పి ప్రభుత్వం స్వలాభంకోసం రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నారన్నారు. స్మార్ట్ సిటి కేంద్ర నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు వెనుకబడిన ప్రాంతాల్లో చేయచ్చనీ, కానీ అందుకు ఎలాంటి ప్రణాళికలు వీరికి లేవనీ, కాలాన్ని వృధా చేసి మాటలతో గడిపేసారనీ విమర్శించారు. లోగడ జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధికి బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచలేని ఈ వై.సి.పి ప్రభుత్వం పాలనకు అర్హత కోల్పోయిందన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడేందుకు మీ మద్దతు ఇవ్వవలసినదిగా అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో బండి సుజాత, ఏలేటి సోని, దీప్తి, వాడమొదలు రత్నం, మాలతి, దేవి, శాంత, విజయ, మెండు ఆదిత్య, అల్లంపల్లి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.