1వ వార్డులో ఉమ్మడి అభ్యర్థి బొనేల విజయచంద్ర పర్యటన

పార్వతీపురం, తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం పార్వతీపురం జగన్నాధపురం 1వ వార్డులో అశేష స్పందన జనవాహిని మధ్య కార్యక్రమం ముందుకు సాగింది. విజయ చంద్రకు ఘన స్వాగతం పలికిన ప్రజలు మహిళలు విజయ తిలకం దిద్ది అడుగడుగునా నీరాజనం పలికారు. విజయ చంద్ర రాకతో ఒక్కసారిగా జగన్నాధపురంలో తెలుగు అక్కా చెల్లెలు అన్నా తమ్ముళ్లలో ఉత్సాహం పెరిగింది. అనంతరం విజయచంద్ర మీడియా వాళ్ళతో మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గం పేదరిక నిర్మూలనే మా ధ్యేయం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోనే అందరి బ్రతుకులు మారుతాయి అని అన్నారు. అనంతరం ఇజ్జాడ అప్పలరాజు (1వ వార్డ్ జనసేన కో-ఆర్డినేటర్) మాట్లాడుతూ మా ఉమ్మడి ప్రభుత్వం రాగానే ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాడమే మా లక్ష్యం అని తెలిపారు. అలాగే కొందరు సీనియర్ నాయకులు మాట్లాడుతూ జనసేన – తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చదువుతున్న విద్యార్థులుకు వాళ్లని విద్యావంతులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దే విధంగా ముందుకు అడుగులు వేస్తాం అని ఇరు పార్టీ నాయకులు తెలిపారు. ఈ పర్యటనలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు చందక అనీల్, రెడ్డి కరుణ రాజాన రాంబాబు, నేయ్యిగాపుల సురేష్, సిరిపిరపు గౌరీ, మానేపళ్లీ ప్రవీణ్, రేవల దుర్గ, శంభాన కూర్మ, రాగొలు శ్రీను, గేదేలవంశీ కృష్ణ, సాంబాన సాయి, గేదేల మురళి, చుక్క విజ్ఞేష్, ధవళ గోవిందా, రగోలు ప్రవీణ్, పొట్నూరు చక్రి, గోర్జన అవినాష్, గోర్జన శ్రీను, రగోలు శ్రీను, ఇజ్జడా సాయి, రగోలు రాంబాబు, ఇజ్జడా త్రినాధ, రగోలు జగదీష్, సొంటేన భాస్కరరా రావు, పొట్నూరు మణికంఠ, వంశీ, మహీష్, నవీన్, లోకేష్, నెల్లి దిలీప్, కోటి మరియు పార్వతీపురం తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామం నాయకులు, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.