జనసేనలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత: డాక్టర్ కందుల నాగరాజు

విశాఖ దక్షిణ నియోజకవర్గం, ముస్లిం మైనార్టీలకు జనసేన పార్టీ ప్రాధాన్యతనిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బుధవారం నాటికి కార్యక్రమం 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ నియోజవర్గంలో పలు మసీదులను, దర్గాలను సందర్శించినట్లు చెప్పారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని వివరించారు. రాజ్యాధికారంలో అందరిని కలుపుకుని వెళ్లిపోయే పార్టీ జనసేన మాత్రమేనని ఆయన చెప్పారు. ముస్లిం మైనార్టీలకు జనసేన పార్టీ మరింత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గం జనసేన నాయకులు, వీరమహిళలు, పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.