జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో గుంతల రోడ్లపై నిరసన

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే విధంగా ఆదివారం జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి చింతల రామకృష్ణ గారు బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి గారు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ రవ్వ ఈశ్వరరావు, టీడీపీ ఎంపీటీసీ వసంతుల తిరుపతిరావు మరియు జనసేన జిల్లా కార్యనిర్వాహన కార్యదర్శి మహంతి ధనుంజయ మరియు టీడీపీ జనసేన నాయకులు రామభద్రపురం గ్రామంలో ఎక్కడ ఎక్కడ రోడ్లు బాగాలేవో పర్యటించి గుంతలమయం అయిన రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హాష్ టాగ్ #ఘుంథలఋఅజ్యమాఫ్ #వ్హ్యాఫతెస్ఝగన్ లలో ప్రచురించారు. ముఖ్యంగా రామభద్రపురం నుంచి ఇట్లామామిడిపల్లి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా పాడాయిపోయిందని అలాగే ఏపీజీవీబీ బ్యాంకు ఎదురుగా ఉన్న రోడ్డు పాడయిపోతే ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజల ఇబ్బందిని గుర్తించి గంతంలో జనసేన మరియు టీడీపీ ఇరుపార్టీలు తమ సొంత నిధులతో ఈ రోడ్డును మరమ్మాత్తు చేపించారు. అలాగే విశాఖ డైరీ ఎదురుగా ఉన్న కాలువను బాగుచేసి అక్కడ రోడ్డు వేసి ఫుట్ పాత్ నియమిస్తానని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు హామీ ఇచ్చి మాట తప్పారు. అలాగే రామభద్రపురం నుంచి వంగపండువలస వెళ్లే రోడ్డు పూర్తిగా పాడాయిపోయింది. అలాగే గుంతలు పడ్డ మిగతా రోడ్లును కూడా సందర్శించి ఈ రోడ్లు వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎక్స్ ఎంపీటీసీ కనిమెరక తిరుపతి, టీడీపీ సీనియర్ నాయకులు చొక్కాపు రామారావు, పెద్దిరెడ్ల మహేష్, పెద్దపల్లి శ్రీను, పెద్దపల్లి సూరి, జనసేన నాయకులు పాండ్రంకి అప్పారావు, చందక గణేష్, ఉత్తరావల్లి వెంకటేష్, వై. పవన్, చెల్లూరి చిన్న, కర్రి తిరుపతి, కె. సంతోష్, నాని, మురళి, సునీల్, రాజు, ప్రవీణ్ మరియు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.