నిరసనలు మరింత ఉదృతం చేస్తాం: హెచ్చరించిన పేడాడ రామ్మోహన్

పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపైన్ #GoodMoringCMsir కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు శ్రీకాకుళం- ఆమదాలవలస ప్రధాన రహదారిలో గల కొత్త రోడ్డు జంక్షన్ వద్ద కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రహదారులు మృత్యు ద్వారాలను తలపిస్తున్నాయని అన్నారు. రోడ్లు అంతా గుంతలమయం కావడంతో ప్రజలు రోడ్డు ప్రయాణం చేయడానికి భయాందళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వము తక్షణమే ప్రభుత్వం స్పందించి రహదారులు మరమ్మత్తులు చేసి ప్రజలకు ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో నిరసనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.