కుటుంబానికి డాక్టర్ కాదు ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కల్పించండి

రాజోలు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు భోజనం సదుపాయం లేకపోవడంతో జనసేన నాయకులు కోళ్ల బాబి స్పందించి వెంటనే రోగులకు భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కనీసం ఆసుపత్రిలో పేషెంట్లకు భోజనం ఏర్పాటు చేయలేని ఈ ప్రభుత్వం ఎందుకని జనసేన నాయకులు డిమాండ్ చేసారు. అలాగే గొల్లమందల సూర్య భాస్కర్రావు ఎన్ని రోజులైనా సరే భోజనం ఏర్పాట్లు చేస్తానని హాస్పిటల్ సిబ్బందికి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కాట్నరాజు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, నియోజకవర్గ నాయకులు పినిశెట్టి బుజ్జి, ఉల్లిశెట్టి అన్నపూర్ణ సాధనాల వెంకన్న బాబు, చింతా ప్రసాద్, గరగ బస్వత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.