కచేరిపేటలో ప్రజా చైతన్య పోరాటం

కాకినాడ సిటి, జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో శ్రీమతి యేలేటి సోనీ ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో కచేరిపేటలో ప్రజా చైతన్యపోరాటం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాంత ప్రజలతో కలిసి వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన గురించి వివరించారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండీ దళితులపై దాడులు చేస్తూ తిరిగి వారిపై ఎస్.సి&ఎస్.టి ఎట్రాసిటీ కేసులు బనాయించడం, స్త్రీలపై అత్యాచారాలు చేస్తూ నిందుతులను వెనకేసుకురాడం లాంటి పనులు చేస్తూ ఆటవిక పాలన చేస్తున్నారన్నారు. అభివృద్ధికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి దోచుకో దాచుకో అన్నదానిమీదే దృష్టి పెట్టారనీ ఈ వై.సి.పి పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించుతున్న వాళ్ళని పొలీసుకేసులతో ఎందుకు అణగదొక్కుతున్నారో కారణం చెప్పమని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, బోడపాటి మరియా తదితరులు పాల్గొన్నారు.