ప్రజావాలంటీర్స్ జర భద్రం

  • పవన్ కళ్యాణ్ కు మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసిన విధానంపై జనసేన నిరసన

వైజాగ్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడిన తీరుని వక్రీకరించి, మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసిన విధానాన్ని, మరియు వైసీపి కార్యకర్తలతో మన నాయకుడిని అవమానింపజేసిన వారిపై జనసేనపార్టీ వీరమహిళా జనసేన నాయకులు, జనసైనికుల నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్దఎత్తున విశాఖ జిల్లా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.