డిజిటల్ క్యాంపెయిన్ లో పుట్టపర్తి జనసేన

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రోడ్ల దుస్థితి గురించి మొదలు పెట్టిన డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మునిసిపాలిటీ పరిధిలోని బ్రిడ్జి దగ్గర నుండి సాయి నగర్ నుంచి చిన్నపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు అత్యంత దారుణంగా ఉన్న రోడ్ల గురించి జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు వెల్లడించారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నా పుట్టపర్తిలోని రహదారులు ఇంకా బాగు చేయకపోవడంతో వృద్దులు, మహిళలు, మరీ ముఖ్యంగా ఇదే దారిగుండ రోజు వెళ్ళే విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిద్ర లేచి వెంటనే రోడ్డు పనులు పూర్తి చెయ్యాలని పుట్టపర్తి జనసేన పార్టీ తరుపున కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, బోయ వంశీ, సాయి ప్రభ, మేకల పవన్ కళ్యాణ్, అభి, చిగిచర్ల గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు.