రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

  • నియోజవర్గ ఇన్చార్జి గౌతం కుమార్
  • 5 మండల అధ్యక్షులతో సమావేశం

ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో జనవరి 27వ తారీకున జరిగే రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి పర్యటన జయప్రదం చేయాల్సిందిగా కోరడమైనది. నియోజకవర్గ ఇన్చార్జి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ 5 మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో ఈ రోజున సమావేశం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు గారి సభను జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు 5 మండలాల నుంచి నియోజక వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, బెలుగుప్ప మండల అధ్యక్షులు సుధీర్, వజ్రకరూరు మండల అధ్యక్షులు అచనల కేశవ, విడపనకల్ మండల అధ్యక్షులు గోపాల్ మరియు జనసేన నాయకులు దేవేంద్ర, రమేష్, తిలక్, మల్లికార్జున, మల్లేష్ గౌడ్, మణికుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.