జేఎస్పి రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు రేడియం జాకెట్లు

గుంటూరు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీ.శే.దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఆదివారం గుంటూరులోని కార్మికసేన కార్యాలయం నందు జేఎస్పి రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు రేడియం జాకెట్లు అందజేశారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వారిచే జారిచేయబడుతున్న ఇ-శ్రమ కార్డులు నమోదు చేయించి కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసీన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ నేడు రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన చాలా మంది 10 తరాల వారు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు కూడబెడుతున్నారని, కానీ అత్యంత విలువలతో కూడిన వ్యక్తిత్వం కలిగిన స్వర్గీయ దామోదరం సంజీవయ్య కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు విధంగా మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచేలా పాలన చేశారని, బడుగు జీవుల సంక్షేమం కోసం వేలాది ఎకరాలను ప్రజలకు పంపిణీ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అన్నదాసు వెంకట సుబ్బారావు, సోమి ఉదయ్ కుమార్, బండారు రవీంద్ర, పాములూరి కోటేశ్వరరావు, సోమి శంకర రావు, బొడ్డుపల్లి రాధాకృష్ణ, కె. అజయ్ కుమార్, అజయ్, నాని, సతీష్, సాయి, శ్రీను, నవీన్, కార్మిక సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.