జనసేనలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త రాయిపాటి ప్రసాద్

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాయిపాటి ప్రసాద్ సోమవారం ఉదయం జనసేన పార్టీలో చేరారు. ఈయనకు పలు రాష్ట్రాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఉన్నాయి. హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ప్రసాద్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.