రాజ్యాంగ రూపకర్తకు నివాళులర్పించిన రాజాం జనసేన

రాజాం, భారత రాజ్యాంగం నిర్మాత, ప్రపంచ మేధావి సంఘసంస్కర్త, ప్రజాస్వామ్య పరిరక్షకుడు భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు మరియు జనసైనికులు రాజాం టౌన్ లోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆ మహనీయునికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు మాట్లాడుతూ “బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్” అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.