నిరాహార దీక్ష చేస్తున్న పాఠంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులను కలిసిన రాజమహేంద్రవరం జనసేన నాయకులు

రాజమహేంద్రవరం జనసేన పార్టీ నగర ఇంచార్జ్ వర్యులు అనుశ్రీ సత్యనారాయణ ఆదేశాల మేరకు శుక్రవారం జగ్గంపేట నియోజకవర్గం వెంగాయమ్మపురం గ్రామం వద్దకు జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరానికి వెళ్ళడం జరిగింది. పనికి ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే కూలి సొమ్ములు న్యాయంగా కష్టపడే వారికి దక్కకుండా అధికారులు అడ్డదిడ్డంగా నచ్చిన వారిచే మస్తరు వేయించి వారు పనికి వెళ్లకపోయినా డబ్బులు ఇవ్వడం జరుగుతుందని సూర్యచంద్ర దృష్టికి వచ్చింది. తక్షణమే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి పేదలకు న్యాయం చెయ్యాలని, ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి నాలుగు రోజులుగా సూర్యచంద్ర దంపతులు చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపడానికి వెళ్ళిన వారిలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి విన్నా వాసు, రామేన మోహన్, రోక్కం ఉమా శంకర్, ప్రెగారెడ్ల నాగేంద్ర తదితరులున్నారు.