కలబురిగి రోడ్డు ప్రమాదం అత్యంత విషాదకరం

కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కి చెందిన రెండు కుటుంబాలవారు గోవాలో పుట్టిన రోజు వేడుకలకు హాజరై బస్సులో వస్తుండగా ఈ ఘోరం చోటు చేసుకొందని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. ఈ ప్రమాదంలో మృత్యువాత పడినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను శ్రీ పవన్ కళ్యాణ్ కోరారు.