మహాత్మా గాంధీ వర్ధంతి దినోత్సవం సందర్భంగా వీరఘట్టం జనసేన తరపున ఘన నివాళులు

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం లో మహాత్మా గాంధీ వర్ధంతి మరియు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీరఘట్టం జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. సమాజంలో మార్పుకు మనమే నాంది కావాలి అంటూ ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి విదేశాలలో ఉపాది వచ్చినా ధనార్జనకై పాకులాడక సామాన్యులతో కలిసి జీవనం సాగిస్తూ సత్యం అహింస ఆయుధాలుగా స్వాతంత్ర పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జి జీవన శైలి జాతికి చిరస్మరణీయం అంటూ బాపూజి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మండల నాయకుడు మత్స పుండరీకం అన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాంధీ మార్గాన్ని ఎన్నుకొని రాజకీయాల్లో, పరిపాలనలో మార్పులు తీసుకురాడానికి కృషి చేస్తున్నారు, అదేవిధంగా ఎంతో మంది స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహర్ జోహార్. ఈ కార్యక్రమంలో కంటు మురళి, సాధు జనార్ధన్, రౌతు మురళి, వావిలపల్లి నాగభూషణం, డాక్టర్ దత్తి గోపాలకృష్ణ, వాన కైలాష్, బి. వేంకటరమణ తదితరులు ఘన నివాళి అర్పించారు.