క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న రాజంపేట జనసైనికులు

కడపజిల్లా రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం లో వార్డు మెంబర్ గా పోటీచేసిన కొత్తూరు వీరయ్య ఆచారి, గోవర్ధన్ ఆచారితో పాటు ఇంకో ఐదుగురు తాళ్లపాక రవి, బాలసాయిక్రిష్ణ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అనంతరం మీడియా తొ మాట్లాడుతూ.. మేము కుల మతాలకు అతీతంగా జనసేన పార్టీకి పనిచేస్తున్నాం. మన ఏపీలో మార్పు రావాలంటే ఇపుడున్న రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీలకు చేతకాదు.. ఒక్క జనసేన పార్టీ కే మార్పు సాధ్య పడుతుందని.. మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పార్టీ లో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. మా జీవితాంతం జనసేన పార్టీ లోనే వుంటాం. పార్టీని రాజంపేటలో భలోపేతం చేస్తామని మీడియాతో వివరించడం జరిగింది.